అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

24, ఆగస్టు 2013, శనివారం

అప్రశిఖ కథ

అప్రశిఖ కథ

అనగా అనగా రాజ్యం లో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిద్దరికి ఇద్దరు పుత్రులు. తమ పిల్లలు మంచి విద్యావంతులు కావలని వారికోరిక. వారికోరిక కు తగినట్లు తమ రాజ్యానికి దూరంగా మహాముని ఉన్నాడని అతడు సకల శాస్త్ర పారంగతుడని తెలుసు కున్నారు.

        పూర్వం విద్యాభ్యాసానికి గురు కులాలకు విదార్థులు వెళ్ళి విద్యను అభ్యసించే వారు. కావున తమ పిల్లలును కూడా దూర దేశాలకు పంపి విద్యావంతులని చేయాలని వాళ్ళు అకాంక్షించారు. మిత్రుల ఇద్దరి పిల్లలు "అజేయుడు - విజేయుడు" కూడా స్నేహంగా ఉండేవారు. ఏలాగైతేనేం పిల్లలకు కూడా దేశాటన చేసి విద్యా విఙ్ఞానాలను సముపార్జించాలని కోరిక కలిగింది. వారి కోరిక మేరకు వింధ్యాటవిలో విద్యా నంద స్వామి వద్ద కావ్యాలంకార తర్క మిమాంశాది అనేక శాస్త్ర విషయాలు నేర్చుకొని పెద్ద వారై "అజేయుడు - విజేయుడు" ఇంటి ముఖం పట్టారు.

       అయితే, దారిలో అనేక రాజ సంస్థానాలలో వారి ప్రతిభా పాటవములను మెచ్చు కొంటూ అనేక రాజన్యులు సత్కారములు విలువైన కానుకలు సమర్పించారు. వచ్చిన వన్నీ "విజేయునికి" మాత్రమే అజయునికి ఏమీ రాక పోవడం తో మాత్స్యర్యంతో తన మిత్రుడైన విజయుని చంపాలని నిశ్చయించు కున్నాడు.  తన మిత్రునికి విషయం చెప్పి మరీ చివరి మాటగా మీ తల్లి దండ్రులకు ఏం చప్ప మంటావ్. నువ్వు గొప్ప పండితుడివే కావచ్చు, ఈ కానుకలు నాకే వచ్చాయని చెప్పవచ్చు అయిన నువ్వు నేను ఒక చోట ఉంటే నేను నీ కంటే గొప్ప వాడిని కాలేను. చివరి సారిగా ఒక అవకాశం నీకిస్తున్నా. కాని నువ్వు చెప్పే మాటలో నేను నిన్ను చంపుతున్నాననే అర్థం ఉండకుండా చెప్పు " అని అన్నాడు అజేయుడు.

 విజేయుడు "అప్రశిఖ" అని చెప్పాడు 

 శ్లో | |  నేన తవ పుత్రస్య |
        ప్రసుప్తస్య వనాంతరే | |
        శిఖ మాక్రమ్య పాదేన | 
        డ్గేన శిరః ఖండితః | |    

 అనువాదం : -  శ్రీమతి జయ మహేశ్వరి
  య్య గురు వాఙ్ఞ నిలు జేర నరయు చుంటి |
  ప్రతిభ నోర్వక పగను కారడని మధ్య | |
  శిఖను కాలి తో త్రోక్కుచు సిగ్గు విడిచి |
  డ్గమున  మిత్రుడే నన్ను కాల పరిచె | |
  
 అజయుడు మోసు కొచ్చిన సందేశం కాల క్రమంలో అతని మోసం 
బయట పడతాయి. తెలివైన వాని మాటలు ఏ నాటికీ నిలిచిపోతాయి.
 నిజం నివురు గప్పిన నిప్పే కదా ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి